- Advertisement -
హైదరాబాద్: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీలో చోటుచేసుకుంది. హైదర్ నగర్ వాటర్ వర్క్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పురశేఖర్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిన్న పురశేఖర్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకు ముందే వీడియో తీసి తన తమ్ముడికి పంపించాడు. మృతుడు వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Water tank driver commits suicide by hanging
- Advertisement -