- Advertisement -
సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ : మార్చి 15 కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ : 9 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నిందితుడైన పరారీలో ఉన్న వాణిజ్యవేత్త విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించడానికి సర్వవిధాలా ప్రయత్నిస్తున్నామని అయితే ఇందులో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టు కు వివరించింది. మాల్యాను రప్పించడంపై యథాతధ స్థితిని వివరిస్తూ నివేదిక సమర్పించడానికి కొంత సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించడంతో ధర్మాసనం ఈ కేసు విచారణను మార్చి 15 కి వాయిదా వేసింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ సమస్యను బ్రిటన్ ప్రభుత్వంతో చర్చించిందని, ఈమేరకు అన్ని ప్రయత్నాలు సాగిస్తోందని మెహతా కోర్టుకు వివరించారు.
- Advertisement -