Thursday, April 25, 2024

గవర్నర్ ముందు సిఎం అశోక్ గెహ్లాట్ పరేడ్

- Advertisement -
- Advertisement -

We want to start the State Assembly session from Monday

లక్నో: రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకూ మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మద్దతుదారులతో కలిసి గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గురువారం నాడే గవర్నర్ కు లేఖ రాశామన్న గెహ్లాట్, దానిపై గవర్నర్ ఇప్పటిదాకా స్పందించలేదని పేర్కొన్నారు. కేంద్ర నుంచి ఒత్తిడి ఉండడం వల్లనే గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సిఎం గెహ్లాట్ ఆరోపించారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సచిన్ పైలట్ తో పాటు ఆయన వర్గం ఎంఎల్ఎల విషయంలో యాథాతథస్థితి కొనసాగించాలని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చిన కాసేపటికే సిఎం అశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News