- Advertisement -
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రా కోల్కతా సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్యాస విడిచారు. సోమెన్ మిత్రాకు భార్య, కొడుకు ఉన్నారు. కిడ్ని, గుండె సంబంధిత సమస్యలతో సోమెన్ మిత్రా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అయితే మిత్రాకు బెంగాల్ రాజకీయాల్లో అపార అనుభవగ్నుడు సోమెన్ మిత్రాకు లోక్ సభ ఎంపిగా పనిచేసిన అనుభం కూడా ఉంది. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
West Bengal Congress president Somen Mitra No more
- Advertisement -