Friday, March 29, 2024

ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

జెనీవా : భారత్‌లో తయారైన దగ్గుమందుకు ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు దగ్గుమందులను ఉజ్బెకిస్థాన్ లోని చిన్నారులకు వాడొద్దని హెచ్చరించింది. “ఈ మరణాల నేపథ్యంలో భారత్ లోని మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందులను చిన్నారులకు వాడకూడదని సూచిస్తున్నాం. ఆ రెండు దగ్గుమందుల పేర్లు ‘అబ్రోనాల్’, ‘డాక్1 మ్యాక్స్’.

ప్రయోగశాలల నివేదిక ప్రకారం … దగ్గుమందులో పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నాయి. ఈ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకమైనవి. నాణ్యతా ప్రమాణాలు అందుకోవడంలో విఫలమయ్యాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన డాక్1 మాక్స్’ సిరప్ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్టు ఇటీవల ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆరోపించింది.

21 మంది పిల్లల్లో 18 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో దానిని తీసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టర్ చేయించుకుంది. కొన్ని నెలల క్రితం కూడా ఈ తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. హర్యానా లోని సొనెపట్ కేంద్రంగా పనిచేసే మైడెన్ ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేసిన సిరప్‌లు వినియోగించి గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News