- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో విషాదం చోటుచేసుకుంది. బిఎస్ మక్తాలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత భార్యా (రోజా) మృతి చెందిన కాసేపటికి భవనంపై నుంచి దూకి భర్త నాగేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వీరు ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య కారణాలపై విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
wife and husband Commits Suicide in Panjagutta
- Advertisement -