Saturday, April 20, 2024

భర్త కుట్టిన జాకెట్ బాగోలేదని భార్య ఉరేసుకొని

- Advertisement -
- Advertisement -

Wife commit suicide in Hyderabad

 

హైదరాబాద్: భర్త కుట్టిన జాకెట్ బాగోలేదని భార్య ఉరేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాసులు(40), టి విజయ లక్ష్మి(35) అనే దంపతులు గోల్నాకలో ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు బైక్‌పై తిరుగుతూ చీరలు అమ్మడంతో పాటు ఇంట్లో టైలర్ పని చేసేవాడు. శనివారం భార్య కోసం శ్రీనివాస్ జాకెట్ కుట్టాడు. జాకెట్ తనకు నచ్చలేనది భర్తకు చెప్పడంతో ఆయన కుట్లు విప్పి నచ్చినట్టు కుట్టుకో అని కోపంగా చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురైంది. వెంటనే ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియ వేసుకుంది. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ ఉండిపోయాడు. పాఠశాలకు వెళ్లి తన పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. తలుపు తట్టిన కూడా తీయకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News