Saturday, April 20, 2024

భర్త ఆత్మహత్య…. రెండు నెలల తరువాత భార్య చెరువులో దూకి…

- Advertisement -
- Advertisement -

Wife commit suicide in Kamareddy

 

కామారెడ్డి: భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలల తరువాత కూతురుతో కలిసి భార్య చెరువులో దూకిన సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… చాకలి పోశి లక్ష్మి-స్వామి దంపతులకు (26) రెండు సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. రెండు నెలల క్రితం స్వామి ఉరేసుకున్నాడు. దీంతో ఇంటిలో కూతురుతో కలిసి లక్ష్మిజీవిస్తోంది. కుటుంబంలో కలహాలు రావడంతో లక్ష్మి తన కూతురుతో కలిసి చెరువులో దూకింది. లక్ష్మి ఇంటి దగ్గర లేకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. చెరువుకు సమీపంలో ఆమె చెప్పులు, ఆధార్ కార్డు లభించడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చిన గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. చెరువులో వెతకగా మృతదేహాలు కనిపించలేదు. మరుసటి రోజు మృతదేహాలు చెరువులో తేలడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News