Friday, March 29, 2024

భర్త బ్యాంక్ మేనేజర్… భార్య ఎఇ… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Wife commit suicide in Kurnool

 

అమరావతి: దంపతుల మధ్య గొడవ క్షణికావేశంలో ఎఇ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోనే తిమ్మప్ప తన లక్ష్మీదేవి, కూతురు సుష్మా, కుమారుడు మోహన్‌లతో కలిసి శిల్పా ఎస్టేట్‌లో నివసిస్తున్నాడు. తిమ్మప్ప విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సుష్మా విద్యుత్ శాఖలో ఎఇగా ఉద్యోగం చేస్తోంది. మోహన్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. సుష్మాకు కర్నూలు జిల్లాకు చెందిన కిషోర్‌తో వివాహం జరిపించారు. కిషోర్ ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కర్నూలు ఉండాలని భర్త, ఎమ్మిగనూరులో ఉండాలని భార్య పట్టుబట్టారు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దసరా రోజు ఇదే విషయంపై భర్తతో సుష్మ గొడవకు దిగింది. దీంతో మనస్తాపం చెందిన సుష్మ తన రూమ్‌లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం తాగింది. అనంతరం తమ్ముడు మోహన్‌కు ఫోన్ చేసి ఇదే చివర కాల్ అని మంచిగా చదువుకోవాలని చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మా మృతి చెందింది. కర్నూలు ఎస్‌ఐ మస్తాన్ అలీ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News