Friday, April 19, 2024

కానిస్టేబుల్ క్రూరత్వం…. భార్య చెరువులో దూకి….

- Advertisement -
- Advertisement -

Wife commit suicide with constable torcher

 

మేడ్చల్: కానిస్టేబుల్ తన భార్యను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శివకుమార్ అనే కానిస్టేబుల్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. శివ కుమార్‌కు శ్రీలత అనే భార్య ఉంది. ఆమె లావుగా ఉండడంతో ప్రతి రోజు ఆమెను పలుమార్లు కొట్టడంతో పాటు వేధించేవాడు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అక్కడ మరో వివాహితతో శివ కుమార్ కు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి శ్రీలత మానసికంగా కుంగిపోయింది. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో చెరువులో దూకి ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. శివ కుమార్‌కు భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా కూడా వేధించేవాడని ఆరోపణలు చేస్తున్నారు. శివ కుమార్-శ్రీలత దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. తన తండ్రి ఆరాచకంపై పూసగుచ్చినట్టుగా పోలీసులకు తెలిపాడు. ప్రతీ రోజు తల్లిని కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించేవాడని, బయట నుంచి రాగానే అమ్మపై దాడి చేసి హింసించేవాడని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News