Friday, April 19, 2024

బెడ్ మీద భర్త వాంతులు చేసుకున్నాడని భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Wife commits suicide after husband vomits on bed

 

భోపాల్: బెడ్ మీద భర్త వాంతులు చేసుకున్నాడని భార్య గొడవ పెట్టుకొని ప్రహారీ గొడ మీద నుంచి దూకి ఆమె ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని టిటి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సునీల్ గుప్తా అనే వ్యక్తి తన భార్య కిరణ్ గుప్తాతో కలిసి జీవిస్తున్నారు. ఆ దంపతులకు ఒక కమార్తె ఉంది. సునీల్ గుప్తా టైలరింగ్ పని చేస్తూ పంచశీల నగరంలో జీవిస్తున్నాడు. ఆదివారం సునీల్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. బెడ్ రూమ్‌లోకి వెళ్లిన తరువాత బెడ్‌పైన సునీల్ వాంతి చేసుకున్నాడు. దీంతో దంపతులు మధ్య గొడవ జరిగింది. కోపంతో భార్య ప్రహారి గొడ మీద నుంచి బయటకు దూకింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కూతురు, స్థానికులు కలిసి ఆమెను జెహెచ్ ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయాలు లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసి వైద్యులు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరుసటి రోజు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News