Saturday, April 20, 2024

భర్తకు గుండు కొట్టించి… అతడిపై మూత్రం పోసిన భార్య ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన భార్యకు పలానా వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని భర్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అతడిని ప్రియుడు గుండు కొట్టించి, మూత్రం పోసి అవమానించిన సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంగపేట గ్రామంలో హర్షవర్ధన్ అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

దీంతో హర్షవర్థన్ కోపంతో రగిలిపోయాడు. తన ప్రియురాలి భర్తను పట్టుకొని గుండు కొట్టించాడు…. అతడిపై మూత్రం పోశాడు… పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసి హర్షవర్ధన్, ఆయన అనుచరుడు అన్వర్‌తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవమానంతో భర్త ఎవరికి కనిపించకుండా పారిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News