Thursday, April 25, 2024

భర్తను లారీతో ఢీకొట్టించి…. ప్రియుడితో ప్రియురాలు మర్డర్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: రోడ్డు ప్రమాదంలో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో చోటుచేసుకుంది. దీంతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం(35), నీరుగట్టవారిపల్లెకు చెందిన రేణుకను (32) 11 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గిఫ్ట్‌ల పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంకు నష్టం రావడంతో గత రెండు సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉండి ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు.

దీంతో అతడి భార్య రేణుక స్థానికంగా ఓ పార్టీ నాయకుడు నాగిరెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాగిరెడ్డితో రేణుక చనువుగా ఉండడం గమనించిన సుబ్రహ్మణ్యం పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. భర్తను వదిలించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని భావించిన ఆమె భర్తను చంపాలని నిర్ణయం తీసుకుంది. సుబ్రహ్మణ్యమును రోడ్డు ప్రమాదంలో హత్య చేయాలని ప్రియురాలుతో నాగిరెడ్డి తెలిపాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలుబు ఎక్కువగా ఉందని భార్యకు భర్త తెలిపాడు. వెంటనే వెళ్లి మందులు తెచ్చుకోవాలని భర్తకు సూచించింది. మందులు తీసుకొని వస్తుండగా అతడిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ మృతుడి తమ్ముడు ఈ ప్రమాదంపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు ఒప్పుకున్నాడు. హత్య వెనుక మృతుడి భార్య, ఆమె ప్రియుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిఐ తమీమ్ అహ్మద్ తెలిపారు.

 

Wife killed husband in lorry accident with Lover
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News