Friday, April 26, 2024

వివాహేతర సంబంధం… కల్లుకు పోదామని కాటికి పంపాడు…

- Advertisement -
- Advertisement -

Wife killed husband with lover in Karimnagar

 

కరీంనగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన కరీంనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మానుపాటి రాజయ్య(55), లత అనే దంపతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్నారు. ఎనగండుల బాబుతో లత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో చంపేయాలని ప్లాన్ వేశారు. రాజయ్యను కల్లు తాగుదామని బాబు తన ఆటోలో హుస్నాబాద్ మండలం మడదు తీసుకెళ్లాడు. కల్లు తాగిన తరువాత చంపాడానికి వీలు కాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు బాబుకు లత ఫోన్ చేసి ఎలాగైన చంపాలని పట్టుబట్టింది. ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి అక్కడ అతడికి కల్లు తాగించిన అనంతరం కర్రతో మెడపై బలంగా కొట్టాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కెనాల్‌లోకి మృతదేహాన్ని నెట్టేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు నుంచి తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పలు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో లత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తన భర్తదే నని ఆమె చెప్పింది. ఎనగందుల బాబుపై అనుమానం ఉందని మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News