Friday, March 29, 2024

నిర్మల్‌లో భర్తను ముక్కలు ముక్కలుగా నరికి…

- Advertisement -
- Advertisement -

 

నిర్మల్: ప్రియుడితో కలిసి భర్తను భార్య ముక్కలు ముక్కలుగా నరికి రహదారి పక్కన పడేసిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ అనే వ్యక్తి యాస్మిన్ బేగమ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మహ్మాద్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా తన భర్యను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 16న అబ్దుల్‌ను మహ్మాద్ కర్రతో దాడి చేయగానే పడిపోయాడు. అనంతరం యాస్మిన్ తన ప్రియుడితో కలిసి భర్త గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని బస్తాలో తీసుకపోవడం బయటకు కనపడుతుందని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో మూటకట్టారు. ముఖం గుర్తు పట్టకుండా కిరోసిన్ పోసి తగలబెట్టారు. మూటను ఆటోలో పెట్టి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. రెండో రోజుల అనంతరం తన భర్త కనిపించడంలేదని యాస్మిన్ బేగం మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  మామడ పోలీస్టే పరిధిలో ఆనవాళ్లు లేని మృతదేహం కనిపించడంతో మిస్సింగ్ కేసుల గురించి వివిధ పోలీస్ స్టేషన్లలో సమాచారం తీసుకున్నారు. మోర్తాడ్‌లో మిస్సింగ్ కేసు ఉండడంతో యాస్మిన్ బేగంకు సమాచారం ఇచ్చారు. యాస్మిన్ బేగం ఆ మృతదేహం తన భర్తది కాదని పోలీసులకు తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి వచ్చి మృతదేహం ఆమె భర్తదే అని చెప్పడంతో యాస్మిన్ బేగంను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైనశైలిలో విచారించారు. తన ప్రియుడితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News