Friday, April 19, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య….

- Advertisement -
- Advertisement -

Wife killed husband with lover

హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలు తీసిన సంఘటన సంగారెడ్డి పటాన్ చెరువులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాకు చెంది అనిల్ కుమార్ అనే వ్యక్తి బతుకుదెరువు తెలంగాణకు వలస వచ్చాడు. తన భార్యతో కలిసి అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. తన స్నేహితుడు హరినారాయణతో కలిసి అనిల్ కుమార్ కూలీ పనుల కోసం వెళ్తుంటాడు. అనిల్ భార్య తోడళ్లుడు నరోత్తమ్ కుమార్‌తో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. అనిల్ కుమార్ వీరి వివాహేతర బంధానికి అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనిల్ కుమార్‌ను స్థానికంగా ఉన్న గుట్టలోకి నరోత్తమ్ తీసుకొనిపోయి రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. రెండు రోజుల నుంచి అనిల్ కుమార్ కనిపించకపోవడంతో నరోత్తమ్‌ను హరినారాయణ నిలదీశాడు. తానే హత్య చేశానని చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి అనిల్ భార్య, నరోత్తమ్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News