Saturday, April 20, 2024

ప్రియుడితో కలిసి భర్తను చంపిన దుర్మార్గురాలు

- Advertisement -
- Advertisement -

Wife kills her husband with boyfriend in komaram bheem

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గురాలు ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటుకుల పహాడ్ ఈ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ చెందిన  దేవేందర్, పార్వతి భార్యభర్తలు. కూలీ పనుల కోసం ఇక్కడకు వలసవచ్చారు. వీరితో పాటు రామ్ లాల్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. అయితే పార్వతి, రామ్ రాల్ లో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో భర్త చూసి నీలదీశాడు. దీంతో ఇద్దరు కలిసి దేవేందర్ ను హత్య చేసి పాతిపెట్టారు. తాగిన మత్తులో రామ్ లాల్ తోటి కూలీలతో విషయం చెప్పడంతో ఘోర బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. వీళ్లకు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News