Tuesday, April 23, 2024

భర్తను హత్య చేసిన భార్య…

- Advertisement -
- Advertisement -

Wife kills husband At Nizamabad district

సారంగాపూర్: నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ లో భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. భర్త ఎల్లయ్య(55)ను రోకలిబండతో కొట్టి నర్సమ్మ చంపింది. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి దంపతులు గొడవపడినట్టు స్థానికులు తెలిపారు.  మహిళ హత్య కేసులో ఇటీవల బెయిల్ పై దంపతులు విడుదలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితురాలిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Wife kills husband At Nizamabad district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News