Thursday, April 25, 2024

మద్యం మత్తు… భార్యను చంపి… డీజిల్ పోసి తగలబెట్టి…

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసి అనంతరం ఆమె చనిపోవడంతో డీజిల్ పోసి తగలబెట్టి… కాలిన మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలోని వంతెన కింద పడేశాడు. మరుసటి రోజు తన భార్య కనిపించడం లేదని భర్త స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత 13 సంవత్సరాల క్రితం సంతోషను బానాల ప్రభు పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతలకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. ప్రభు గాడిద పాలు అమ్ముకొని వికారాబాద్ పట్టణంలో రాజీవ్ గృహకల్పలో జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన ప్రభు నిత్య భార్యతో గొడవపడేవాడు. నవంబర్ 11న మద్య సేవించి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె మరణించడంతో డీజిల్ పోసి నిప్పంటించాడు. కాలిన మృతదేహాన్ని సంచిలో చుట్టి ఆటోలో లోతువాగు వంతెన కింద పడేశాడు. నవంబర్ 12న తన భార్య కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం పలుమార్లు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 15న స్థానిక కౌన్సిలర్ వద్దకు వెళ్లి తన భార్య హత్య చేశానని చెప్పాడు.  స్థానిక కౌన్సిలర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రభును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News