Friday, April 26, 2024

వివాహేతర సంబంధం… భర్తకు ఉరేసి…

- Advertisement -
- Advertisement -

Wife murder husband with Lover in warangal

 

వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దర్యావత్ సింగ్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. దర్యావత్ సింగ్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జ్యోతికి అప్పరావు పేటకు చెందిన సాంబరాజు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల గొడవలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దర్యావత్ సింగ్ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో భార్యకు ప్రియుడిని కలుసుకోవడానికి సమయం దొరకడంలేదని భర్తను తొలగించుకోవాలని హత్యకు ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 14న మద్యం మత్తులో దర్యావత్ సింగ్ ఇంటికి వచ్చాడు. అతడు అతిగా మద్యం సేవించి ఉండడంతో చంపడం తేలిక అని గ్రహించిన భార్య ప్రియుడు సాంబరాజుకు పోన్ చేసింది. వెంటనే అతడు ఆటో తీసుకొని ప్రియురాలు ఇంటికి చేరుకున్నాడు. భర్త గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి తన పత్తి చేనులో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మర్నాడు మృతదేహం సగం కాలిపోవడంతో మరోసారి పూర్తి తగలబెట్టి బూడిదను చెరువులో పోశాడు. గత కొన్ని రోజుల నుంచి తన తమ్ముడు దర్యావత్ సింగ్ కనిపించకపోవడంతో వీరన్న సెప్టెంబర్-21న నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి జ్యోతిపై అనుమానం కలగడంతో తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. కాల్ డేటా ఆధారంగా ప్రియుడిని పట్టుకొని కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News