Friday, April 19, 2024

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

- Advertisement -
- Advertisement -
wife murdered her husband with lover
– ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం

మన తెలంగాణ/షాబాద్ : కట్టుకున్న భర్తను అక్రమసంబవధానికి అడ్డుతగులుతున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు ఈ హత్య సమాచారం శనివారం బైటపడిం ది…. గ్రామస్థులు, ఇతరులు తెలిపిన వివరాల ప్రకారం…. షా బాద్ మండల పరిధిలోని కేశవగూడ గ్రామానికి చెందిన పలుగుట్ట మానయ్య (39) తో షాబాద్‌కు చెందిన తోంట శోభకు గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ము గ్గురు పిల్లలు ఉన్నారు. అయితే షాబాద్‌కు చెం దిన బేగరి యాదగిరితో శోభకు కొన్నేళ్ల నుండి వివాహేతర సంబందం కొనసాగిస్తోంది. వివాహేతర సంబదానికి భర్త మానయ్య అడ్డుగా వస్తున్నాడని, ప్రియుడు యాదగిరితో కలిసి భర్త మానయ్యను మామిడిపల్లి సమీపంతో ఈ నెల 13న హత్యచేసి, మృతదేహాన్ని కారులో అచ్చంపేట నల్లమల్ల అడువులో వేసి వచ్చారు.

ఈ హ త్యలో మరో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుండి మానయ్య కనిపించకపోవడంతో ఈ నెల 24న తండ్రి అన ంతయ్య షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మానయ్య మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్య శోభ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆమెపై అనుమానం వచ్చి, తమ స్థాయిలో ప్రశ్నించడంతో హత్యా విషయం వెలువరించిన్నట్లు సమాచారం, హత్య చేసిన నిధితులను తీసుకుని వారు శవాన్ని వేసిన అచ్చంపేట నల్లమల్ల అడవుల్లోకి వెళ్లి మానయ్య మృతదేహన్ని గుర్తించి, స్వాదీనం చేసుకున్నారు. హత్య జరిగిన చాలా రోజులు కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో శవం కుళ్లిపోయింది. ఈ కేసుపై మరిన్ని వివరాలకు పోలీసులు అడుగగా నిందితులను అధుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారంనిందితులను త్వరలోనే పట్టుకుంటాం

షాబాద్ ఇన్స్‌పెక్టర్ అశోక్

మానయ్య అదృష్యం అయిన ఫిర్యాదు అందిన వెంటనే, దర్యాప్తు ప్రారంభించాం. మానయ్య హత్యజరిగిన్నట్లు అనుమానాలు ఉన్నాయి. కేసు దర్యాప్తులో ఉంది. త్వరలోనే పూర్తి సమాచారం అందజేస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News