Friday, April 26, 2024

భార్య ఆత్మ కూతురులోకి ప్రవేశించిందని….

- Advertisement -
- Advertisement -

Wife soul enter into her daughter in Tamilnadu

చెన్నై: తన భార్య ఆత్మ కూతురులోకి ప్రేవేశించడంతో ఆమెను కన్నతండ్రి మంత్రాల పేరుతో చంపేసిన సంఘటన తమిళనాడులోని రామనాథపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామనాథపూరంలో వీరసెల్వం అనే వ్యక్తి తన కూతురు తరుణితో(19) కలిసి ఉంటున్నాడు. వీర సెల్వం భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకోలేదు. తరుణి తన తల్లి సమాధి వద్దకు వెళ్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో వీరసెల్వం భార్య ఆత్మ కూతురు శరీరంలోకి ప్రవేశించడంతో ఆమె ఆరోగ్యంగా ఉండడంలేదని తన కూతురుతో మంత్రాలు తాంత్రిక పూజలు చేయించాడు. కూతురు శరీరం నుంచి ఆత్మం వెళ్లగొట్టడానికి మెడ, నడుముపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. టైఫాయిడ్‌తోనే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News