Friday, April 19, 2024

భర్త ప్రాణాలు తీసిన భార్య వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

Wifes lover killed husband in warangal

వరంగల్: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో ప్రియురాలు కోసం ఆమె భర్తను ప్రియుడు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకుల మహేష్‌కు ఘట్‌కేషర్‌కు చెందిన అశ్విన్‌తో పెళ్లి జరిగింది. మహేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జూన్ 5 నుంచి మహేష్ ఆచూకీ లేకపోవడంతో ఘట్‌కేసర్‌లో అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో గుర్తించారు. నమిలిగొండ ప్రాంతంలో మహేష్ సంచిరించినట్టు సమాచారం రావడంతో కాల్‌లిస్టులో నంబర్ల ఆధారంగా గుర్తించారు. పసుల కుమార్ అనే వ్యక్తి నుంచి చివరి కాల్ వచ్చినట్టు గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను తానే హత్య చేసినట్టు కుమార్ ఒప్పుకున్నాడు. మహేష్‌ను తన బామ్మర్ధి ఇంటికి వెళ్దామని హైదరాబాద్ నుంచి నమిలిగొండకు తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు మద్యం పూటుగా తాగించారు. నమిలిగొండ శివారులోని రేకుల షెడ్ వద్దకు తీసుకెళ్లాడు. తలపై బండ రాయితో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని సంచిలో కట్టి బావిలో పడేశానని పోలీసులు ఎదుట కుమార్ ఒప్పుకున్నాడు. కుమార్‌కు అశ్విన్ కి గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో చంపేశానని విచారణలో ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News