న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి దేశంలో 9 మంది చనిపోగా.. కరోనా బాధితుల సంఖ్య 492కు చేరింది. దేశంలో రెండో దశలో ఉన్న కరోనాని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించనన్నట్లు ప్రధాని మోడీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కీలక విషయాలు ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. మరోవైపు, అత్యవసర సహాయక చర్యలు ప్రకటించాలని మోడీకి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ఇక, కరోనా వైరస్ కారణంగా రాజ్యసభ ఎన్నికలను ఈసి వాయిదా వేసింది.
Will address the nation at 8 pm: PM Modi Tweet