Tuesday, April 23, 2024

కివీస్‌కు ఎదురుదెబ్బ..!

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: భారత్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ గాయానికి గురవ్వడంతో జట్టులో కలవరం మొదలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా విలియమ్సన్ మోచేతికి గాయమైంది. దీంతో అతను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం తీవ్రత తగ్గక పోవడంతో ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో కేన్ బరిలోకి దిగుతాడా లేదా అనేది సందేహంగా మారింది. అతను ఆడే విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒక వేళ కేన్ రెండో టెస్టుకు దూరమైతే అది కివీస్‌కు పెద్ద లోటుగా పరిణమించే ప్రమాదం ఉంది. భారత్‌తో డబ్లూటిసి ఫైనల్ సమరంకు కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివున్న తరుణంలో కెప్టెన్ విలియమ్సన్ గాయం బారిన పడడం న్యూజిలాండ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

Williamson injured in 1st Test against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News