Thursday, April 25, 2024

తల్లి, తనయుడిని చంపి… 17 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు….

- Advertisement -
- Advertisement -

Woman and son murdered in Tamil Nadu

చెన్నై: తల్లి, తనయుడిని చంపి 17 కిలోల బంగారాన్ని దొంగల ముఠా ఎత్తుకెళ్లిన సంఘటన తమిళనాడులోని మయిలదుతురాయ్ జిల్లాలో జరిగింది. వెంటనే పోలీసులు ముగురిని అరెస్టు చేయగా ఓ వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధన్‌రాజ్ అనే వ్యక్తి జువెల్లరీ షాపు ఉంది. మన్నీబాల్, మనుశ్, రమేష్, కర్నారామ్ అనే దొంగలు ధన్‌రాజ్ ఇంట్లోకి చొరబడి ఆతడి భార్య ఆశ, కుమారుడు అఖిల్, కోడలు నిఖిలపై కత్తులతో దాడి చేశారు. భార్య, కుమారుడు ఘటనా స్థలంలోనే చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న కోడలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం నలుగురు దొంగలు కారులో పారిపోయారు. మయిలదుతురాయ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం వెతుకుతుండగా ఎరుకూరు ప్రాంతంలో తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరపడంతో మన్నీబాల్ ఘటనా స్థలంలోనే హతమయ్యాడు. ఇద్దరిని అరెస్టు చేయగా కర్నారామ్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలం నుంచి రెండు తుపాకులు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News