Thursday, April 25, 2024

నెల్లూరు ఎపి టూరిజం ఆఫీస్‌లో దారుణం.. మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ దాష్టీకం..

- Advertisement -
- Advertisement -

అమరావతిః నెల్లూరు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్‌మెంట్ ఆఫీస్‌లో దారుణ సంఘటన జరిగింది. ఆఫీస్‌లో మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ విచక్షణ కోల్పోయి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..నెల్లూరు ఎపి టూరిజం కార్యాలయంలో పనిచేసస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఈనెల 27న దాడి చేశాడు. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు కోపోద్రిక్తుడైన భాస్కర్ ఉద్యోగిని ఉషారాణిని కింద పడేసి ఇష్టానుసారంగా చితకబాదాడు. తోటి ఉద్యోగులు వచ్చి అతన్ని అడ్డుకుంటున్నా కొడుతూనే ఉన్నాడు. దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు మేనేజర్ భాస్కర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్యాలయంలోని సిసి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడు భాస్కర్‌ని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

woman beaten by man of AP tourism hotel in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News