Saturday, April 20, 2024

నాలుగు ప్లాట్ల కోసం బిచ్చగత్తెను చంపిన కోడలు…..

- Advertisement -
- Advertisement -

Woman beggar murder by Daughter in law

 

ముంబయి: నాలుగు ప్లాట్లు ఉన్న బిచ్చగత్తెను కోడలు చంపిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం చెంబూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….సంజన్న 70 ఏళ్లు వృద్ధురాలుకు పిల్లలు లేకపోయేసరికి భర్త వాళ్ల తమ్ముడి కుమారుడి దినేశ్ పాటిల్‌ను దత్తత తీసుకుంది. గత కొన్ని సంవత్సరాల క్రిత భర్త చనిపోవడంతో దినేశ్ పాటిల్ దగ్గర ఉంటుంది. సంజన్న పేరు మీద నాలుగు పాట్లు ఉన్నాయి. ఘోట్క్‌పూర్ ప్రాంతంలోని జైన్ మందిరంలో భక్తుల నుంచి బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. దినేష్ భార్య అంజనాకు వృద్ధురాలు డబ్బులు ఎక్కడ దాచి పెడుతుందోనని అనుమానం కలిగేది. పలుమార్లు అత్త కోడళ్ల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఇంటికొచ్చిన వృద్ధురాలును కోడలు డబ్బులు గురించి అడిగింది.

ఇద్దరు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో క్రికెట్ బ్యాట్‌తో వృద్ధురాలి తలపై కోడలు గట్టిగా బాదింది. అనంతరం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే వైర్ తీసుకొని గొంతు చుట్టి లాగింది. వృద్ధురాలు చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న తరువాత మృతదేహాన్ని రాజవాడి ఆస్పత్రికి తరలించింది. బాత్‌రూమ్‌లో తన అత్త జారిపడిందని డాక్టర్లతో కోడలు తెలిపింది. వృద్ధురాలు మృతదేహం గాయాలు ఉండడంతో పాటు గొంతు నులిమినట్టు గుర్తులు ఉండడంతో డాక్టర్ల అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే వృద్ధురాలుపై ఉన్న బంగారు అభరణాలను కోడలు తీసుకొని లోదుస్తుల్లో దాచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలు మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. వెంటనే కోడలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటపెట్టింది. ప్లాట్లు తన పేరు మీద రాసుకోవడానికే అత్తను చంపానని కోడలు ఒప్పుకుంది.   పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News