- Advertisement -
రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం జగదాంబ తండాలో దారుణ హత్య జరిగింది. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మహిళను దుండగులు గొంతుకోసం దారుణంగా హత్య చేశారు. ఆదివారం అర్ధరాత్రి మహిళ చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆస్తి తగదాల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Woman brutally murdered in Kamareddy
- Advertisement -