- Advertisement -
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లాంకో హిల్స్ 15వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మల్లికగా గుర్తించారు. 3 నెలల క్రితం మృతురాలు నందిగామ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. లాక్ డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. యువతి బలవన్మరణానికి పాల్పడడంతో ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Woman Commits Suicide in Raidurgam
- Advertisement -