- Advertisement -
లక్నో: ఓ గర్భిణి నడి రోడ్డుపై ప్రసవించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. జిల్లా ఆస్పత్రిలో ఓ గర్భవతి కరోనా టెస్టు చేయించుకొని ఇంటికి వెళ్తుండగా నొప్పులు రావడంతో రోడ్డుపైనే ప్రసవించింది. స్థానిక డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ సచిన్ సింగ్ తన కారులో ఆమెను ఎస్ఎన్ మెడికల్ కాలేజీ తరలించాడు. ఆ గర్భవతి అక్కడ మరో బిడ్డకు జన్మనిచ్చింది. పసికందుల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో గర్భవతులు వందల కిలో మీటర్లు నడుస్తూ రోడ్లపైనే ప్రసవిస్తున్న ప్రభుత్వాలు వాళ్లకు సరియైన సదుపాయాలు కల్పించడంలేదు. వలసకూలీలను పాలకులు పట్టించుకోవడం లేదు.
- Advertisement -