Wednesday, April 17, 2024

పిఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Suicide

 

హైదరాబాద్‌ : మంగళవారం రోజున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అయితే అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి మంటల్ని ఆర్పివేశారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరం 35 శాతానికిపైగా కాలిపోయింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకేశ్వరి చనిపోయింది. గతంలో కూడా లోకేశ్వరి పంజాగుట్ట పిఎస్‌లో పలు కేసులు పెట్టింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉంటుంది. కొంతకాలంగా ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్న లోకేశ్వరి… అతడి పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ అఘాయత్యానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Woman died by Suicide attempt
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News