Wednesday, April 24, 2024

కారు – బైక్ ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Woman Died in Road Accident At Jangaon

జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్‌గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అర్వపల్లి గ్రామానికి చెందిన మేకల మల్లేశ్వరీ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త మల్లేష్, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Woman Died in Road Accident At Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News