Saturday, April 20, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సామూహిక అత్యాచారం.. వివాహిత మృతి

- Advertisement -
- Advertisement -

Woman dies after gang rape in Cyberabad limits

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొల్లూరు తాండాకు చెందిన వివాహితపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయింది. అయితే, బుధవారం రాత్రి బాధితురాలిని మియాపూర్ నుంచి కొల్లూరు తాండాకు తీసుకువచ్చిన ముగ్గురు వ్యక్తులు మధు, నందుయాదవ్, కుటుంబరావులు బాధితురాలిపై అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు రామచంద్రాపురం పోలీసులు తెలిపారు. కాగా, మృతి చెందిన మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పన్నెండేళ్ల క్రితం మృతి చెందాడని తండా వాసులు పేర్కొన్నారు.

Woman dies after gang rape in Cyberabad limits

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News