Saturday, April 20, 2024

పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఉద్యోగిని మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలిని నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఎల్ సాయి దీపిక రెడ్డిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం పంజాగుట్ట నుంచి యూసుఫ్ గూడ వైపు స్కూటీపై వెళ్తున్న ఆమెను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన దీపిక రెడ్డి సంఘటనాస్థలంలోనే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Woman Employee dies hit by TS RTC bus at Panjagutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News