Tuesday, April 23, 2024

ఒకే కాన్పులో ఆరుగురు ప్రసవం

- Advertisement -
- Advertisement -

gives birth

షియోపూర్ (ఎంపి): మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో బడోడా గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళ ముర్తిమాలి శనివారం ఒకే కాన్పులో 35 నిముషాల వ్యవధిలో ఆరుగురిని ప్రసవించింది. వీరిలో ఇద్దరు కొద్ది క్షణాల తరువాత మృతి చెందారు. ఆమె నెలలు నిండకనే నలుగురు మగ, ఇద్దరు ఆడ బిడ్డలను ప్రసవించింది. ఆడబిడ్డలు కేవలం 390, 450 గ్రాముల బరువు ఉండగా, మగబిడ్డలు నలుగురూ 615 గ్రాములు నుంచి 790 గ్రాముల బరువుతో ఉన్నారు.

28 వవారం గర్భిణిగా ఉండగా సోమవారం ఉదయం సోనోగ్రఫీ నిర్వహించిన తరువాత ఈ బిడ్డలు పుట్టారని షియోపూర్ జిల్లా ఆస్పత్రి సివిల్‌సర్జన్ డాక్టర్ ఆర్‌బి గోయెల్ చెప్పారు. బరువు తక్కువతో పుట్టిన ఆడబిడ్డలు కొద్ది క్షణాల్లోనే చనిపోగా, నలుగురు మగబిడ్డలను సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ లో వైద్యచికిత్స చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా అనేక మంది ఒకేసారి జన్మించడం అరుదుగా జరుగుతుందని గైనకాలజిస్టు డాక్టర్ మీటా అగర్వాల్ చెప్పారు.

Woman gives birth to 6 babies in MP Sheopur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News