Thursday, April 25, 2024

మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

- Advertisement -
- Advertisement -
Woman gives birth to baby in ambulance in Bhasara
తల్లి కూతురు క్షేమం

నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర మండల పరిధిలోని కిర్గుల్ (బి) గ్రామంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. స్థానికంగా ఉండే జాదవ్ మంజుషా (24) కు శనివారం ఉదయం పురిటినొప్పులు రావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. అనంతరం మంజూషాను ప్రసవనిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా కిర్గుల్, టాక్లి గ్రామమార్గ మధ్యలో ప్రసవించింది. మంజూషా రెండవ కాన్పులో భాగంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందు మంజూషాకు అంబులెన్స్‌లోనే మెరుగైన చికిత్స అందించడంతో మామూలు ప్రసవం అయింది. దీంతో భర్త పరమేశ్వర్ తమ కుటుంబీకులు కిర్గుల్ (బి) గ్రామస్తులు 108 సిబ్బంది సేవలు గణణీయమని కొనియాడుతూ మానవత్వం చాటుకున్న సిబ్బంది ఈఎమ్‌టీ భోజన్న, పైలట్ గౌతమ్‌ను పలవురు అభినందించారు. తల్లి కూతురు క్షేమంగా ఉన్నారని వారికి చికిత్స అందిస్తున్నామని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

Woman gives birth to baby in ambulance in Bhasara

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News