Tuesday, April 23, 2024

పిల్లలతో సహా రైలుకింద పడిన తల్లి

- Advertisement -
- Advertisement -

woman jumps in front of train with Two kids in Peddapalli

రామగుండం: పెద్దపల్లి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి రైలుకింద పడి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి అరుణ, కుమారై స్వాత్విక(3) మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారాంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

woman jumps in front of train with Two kids in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News