Wednesday, April 24, 2024

ఫోన్ వాడొద్దన్నందుకు పిల్లలను చంపి, ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman kills children and commits suicide at mysore

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మైసూర్ నగరంలో ఆదివారం దారుణం చోటుచేసుంది. సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఓ భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే ముజిమిల్, సుఫియా దంపతులకు ఇద్దరు పిల్లలు. సుఫియా కొన్ని రోజులుగా మొబైల్ ఫోన్ కు బానిసైంది. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ ను భర్త ఆఫీసుకు తీసుకెళ్లాడు. చేతిలో మొబైల్ లేక తీవ్ర మనస్తాపానికి లోనైనా సుఫియా ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ప్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయాలు అలుముకున్నాయి.

Woman kills children and commits suicide at mysore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News