- Advertisement -
హైదరాబాద్: నగరంలోని చింతల్ భగత్ సింగ్ నగర్ లో దారుణ హత్య జరిగింది. దుండగులు మహిళను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారు. మహిళ మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు స్థానికులు తెలిపారు. నిన్న మహిళ భర్త విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూమారు రూ.5లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. మృతురాలి భర్త జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమారుడు హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
woman murdered in chintal hyderabad
- Advertisement -