Thursday, April 25, 2024

గుల్బర్గా ఆసుపత్రిలో మానసిక రోగిపై అత్యాచారం: నిందితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గుల్బర్గా(కర్నాటక): గుల్బర్గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో శుక్రవారం రాత్రి ఒక మానసిక రోగిపై 36 ఏళ్ల వ్యక్తి ఒకడు అత్యాచారానికి పాల్పడ్డారు. గత ఏడు నెలలుగా ఆ మానసిక రోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఇస్లామాబాద్ కాలనీకి చెందిన మెహబూబ్ పాషా మదర్సాబ్‌గా గుర్తించారు.

రాత్రి డ్యూటీలో ఉన్నహెడ్ నర్సు మహాదేవి మాతాపతి బ్రహ్మపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మరో రోగి బంధువు ఒకరు నిందితుడిని పట్టుకుని ఆసుపత్రి భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. ఐపిసిలోని 376 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి ప్రశ్నించనున్నట్లు మహాబురగి నగర పోలీసు కమిషనర్ చేతన్ ఆర్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం నివేదికను వైద్య విద్యా శాఖకు కూడా పంపుతామని ఆయన తెలిపారు. కాగా.. పోలీసు అధికారులు ఆసుపత్రిని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను తిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News