Friday, March 29, 2024

దారుణ సంఘటన.. ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

 

వడోదర: బస్సులో ప్రయాణించిన ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీలసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని పోర్‌బందర్ లో నివసిస్తున్న దినసరి కూలి అయిన బాధితురాలు తన భర్తతో కలిసి మధ్యప్రదేశ్ లోని కుక్షి పట్టణానికి వెళ్ళింది. తర్వాత గురువారం రాత్రి పోర్బందర్ కు ఒంటరిగా బయల్దేరింది.ఈ క్రమంలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కింది. దారి మధ్యలో ఓ హోటల్ వద్ద బస్సు కొద్దిసేపు ఆగింది. ప్రయాణికులంతా బస్సు దిగి తినడానికి హోటల్ లోకి వెళ్లారు. అయితే, బాధితురాలు బస్సులోనే పడుకొని ఉండడం గమనించిన డ్రైవర్, కండక్టర్ లు.. ఇదే అదునుగా భావించి ఆమెను బస్సు టాప్ పైకి బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించారు. దీంతో అదే బస్సులో పోర్‌బందర్ కు చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని తన బందువులకు చెప్పింది. ఆ తర్వాత బాధితురాలు బందువులతో కలిసి పోర్‌బందర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Woman raped by Bus driver, conductor in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News