Friday, March 29, 2024

పోలీసుల పేరుతో నాటకం.. మహిళపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape

 

జహీరాబాద్(హైదరాబాద్) : పోలీసులమంటూ నాటకమాడి బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలిని బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంగళవారం చోటుచేసుకుంది. తన కుమారుడిని బెదిరించి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు జహీరాబాద్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన షాహినా భేగం (32) తన పన్నేండేళ్ల కుమారుడు గుట్కా ప్యాకెట్లు కలిగిన బస్తాలతో మంగళవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ బస్టాండ్ లో సుర్యాపేట వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చి మేం పోలీసులమని బెదిరించారు. లగేజీలో నిషేధిత గుట్కాలు ఉన్నాయంటూ పస్తాపూర్ చౌరస్తాలో మహిళ, ఆమె కుమారుడితో సహా ఇద్దరు వ్యక్తులు బస్సు దిగారు.

ఈక్రమంలో లగేజీని పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా మరో వ్యక్తి మాట్లాడాలంటూ మహిళను సమీపంలోని ఎస్‌బిఐ వెనుకవైపున ఉన్న పాడుపడిన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలాన్ని జహీరాబాద్ సిఐ సైదేశ్వర్ ఎస్‌ఐ వెంకటేశ్ పరిశీలించారు. అత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులు గుట్కా ప్యాకెట్ల బస్తాలతో పరారయ్యారని వారికోసం గాలిస్తున్నామని పోలీసులు వివరిస్తున్నారు.

Woman raped in police name
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News