Friday, April 26, 2024

గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Woman suicide after delivery at Godavarikhani Govt Hospital

పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఓ బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 12న ఆస్పత్రిలో కమాన్ పూర్ మండలంలోని రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, మూడు సార్లు సర్జరీ చేసినా కుట్లు అతుక్కోకపోవడంతో బాలింత మనోవేదనతో ఆస్పత్రిలోని బాత్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Woman suicide after delivery at Godavarikhani Govt Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News