Saturday, April 20, 2024

కూతురుతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

woman suicide by jumps into well with daughter

మనతెలంగాణ/వీణవంక: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది వీణవంక మండల కేంద్రానికి చెందిన రాయిశెట్టి రమ్య(36), మూడేళ్ళ కూతురు శ్రీనిఖతో కలిసి వీణవంక గ్రామశివారులోని బావిలో పడిమృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. రమ్య గతకొంత కాలంగా వీణవంకలో సమీప బందువులకు చెందిన మీసేవకేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తుంది. గురువారం కూతురు శ్రీనిక ఆరోగ్యం బాగా లేదని మీసేవా కేంద్రానికి రాలేనని, వారికి తెలిపి ఆసుపత్రికి వెలుతున్నట్లు వెల్లి అనూహ్యరీతిలో బావిలో దూకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రమ్య భర్త శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగానే రమ్య, కూతురుతో సహా బావిలో దూకిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

కాగా, రమ్య పుట్టిన ఊరు, అత్తగారి ఊరు రెండూ వీణవంక గ్రామమే. తనతో పాటు చిన్నారిని కూడాపట్టుకుని తనువు చాలించిన పరిస్థితిపై గ్రామస్తులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులు బావివద్దకు చేరుకుని బావిలో వెతెకులాడగా తల్లీకూతుళ్ల మృతదేహాలు దొరకడంతో బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపారు.

woman suicide by jumps into well with daughter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News