Friday, April 19, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Woman Suicide in Mailardevpally

హైదరాబాద్: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఫాతిమా సుల్తానా అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Woman Suicide in Mailardevpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News