Friday, April 19, 2024

అఫ్ఘన్‌లో దారుణం.. మహిళా జర్నలిస్ట్ హత్య

- Advertisement -
- Advertisement -

Woman TV journalist shot dead in Afghanistan

కబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో మహిళా జర్నలిస్టును గుర్తు తెలియని ముష్కరులు కాల్చిచంపారు. ఈ సంఘటన ప్రాంతీయ రాజధాని జలాలాబాద్‌లో చోటుచేసుకుంది. “ప్రైవేట్ రేడియో టివి స్టేషన్‌లో పనిచేస్తున్న మలాలై మైవాంద్ ఈ రోజు ఉదయం రష్ అవర్‌లో జలాలాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనంతరం నిందితులు తప్పించుకున్నారు” అని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మైవాంద్ డ్రైవర్ కూడా మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నవంబర్ మధ్య నుండి ఆఫ్ఘనిస్తాన్ లో చంపబడిన రెండవ జర్నలిస్టు మలాలై మైవాంద్. నవంబర్ 12 న హెల్మండ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో మరో జర్నలిస్ట్ అలియాస్ దయే మృతి చెందాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News