Saturday, April 20, 2024

లైంగిక వేధింపులు…. యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -


ఆదిలాబాద్: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్కపల్లి గ్రామంలో జునుగిరి శ్రీనివాస్(40), సుజాత్(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. వీళ్ల ఇంటి పక్కన ఉంటున్న రాచర్ల కృష్ణ అనే వ్యక్తి సుజాత్ గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన సుజాత తన భర్తతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన కృష్ణ తన మార్చుకోకుండా మళ్లీ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మనస్థాపం చెందిన ఆమె తన ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News