Friday, March 29, 2024

చెట్టుకు ఉరేసుకున్న ఇద్దరు యువతులు

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డెంటల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు చెత్తవేయడానికి జిహెచ్‌ఎంసి కార్మికులు వెళ్లారు. ఇద్దరు యువతులు ఉరేసుకున్నట్టు గుర్తించిన కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలో పాప మృతదేహం కనిపించింది. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సెల్‌ఫోన్ దొరికింది. ఆ నంబర్ నుంచి చివరగా కరీంనగర్ కు ఫోన్  చేసినట్టు సమాచారం. మృతులు స్థానికులా? లేక కరీంనగర్ వాసులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Women Commit suicide in Jawaranagar in Medchal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News