Thursday, April 25, 2024

అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం….

- Advertisement -
- Advertisement -

Fire broke out at Plywood factory in Rangareddy

అమరావతి: ఓ మహిళ అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఎఎస్ పేట మండలంలో జరిగింది. షాపా బావి వద్ద గుడిసెకు నిప్పంటుకోవడంతో ఒకరు సజీవదహనం కాగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్య్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు ఫాతిమా హైదరాబాద్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మతిస్థిమితం లేకపోవడంతో హైదరాబాద్ నుంచి దర్గాకు వచ్చారని స్థానికులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News